Sunday, April 20, 2025

Creating liberating content

తాజా వార్తలుఅంకితభావంతో పనిచేసేగుణం ఉన్నవాడు వీరారెడ్డి:మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి

అంకితభావంతో పనిచేసేగుణం ఉన్నవాడు వీరారెడ్డి:మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి

పులివెందుల
పులివెందుల ఎంఈఓ గా పనిచేస్తూ పదవీ విరమ ణ పొందిన ఎంఈఓ బండి వీరారెడ్డి అంకితభావం తో పనిచేసే గుణం ఉన్నవాడని మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక శిల్పారామం సమీపంలో ఉన్న సాయిబృందావన్ గార్డెన్లో ఎంఈఓ బండి వీరారెడ్డి పదవి విరమణ సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజమని అయితే వీరారెడ్డి లాంటి వ్యక్తులు పదవీ విరమణ చేస్తూ ఉంటే చాలా బాధగా ఉందన్నారు. తన వృత్తి పట్ల ఎంతో శ్రద్ధగా అంకితభావంతో పని చేస్తారన్నారు. ఎంతో ఓర్పు దేవుడు ఆయనకు ప్రసాధించారన్నారు. ఆయనశేషజీవితం ఎంతో ఆనందంగా,ఆయురా రోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని దేవుని కోరుకుంటున్నానన్నారు. అనంతరం పలువురు ఆయనను ఉద్ధేశించి ప్రసంగించారు. అనంతరం మండలంలోని ఉపాధ్యాయులు ఆయనను దుశ్శాలవాలతో,పూలమాలలతో సత్కరించారు. పులివెందుల ఉపాధ్యాయులు ఆయనను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గంగాధర్ రెడ్డి, కౌన్సిలర్లు కోడి రమణ, జేసిఎస్ ఇంచార్జ్ కౌన్సిలర్ పర్ణపల్లి కిషోర్, సీకే వెంకట నాథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితర ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యా యనిలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article