Sunday, April 20, 2025

Creating liberating content

తాజా వార్తలుఆలయం వద్దే భిక్షాటన..ఆలయ అభివృద్ధికి సాయం

ఆలయం వద్దే భిక్షాటన..ఆలయ అభివృద్ధికి సాయం

ముత్యాలపాడు సాయిబాబా మందిరానికి లక్ష రూపాయల విరాళమిచ్చిన యాచకుడు

ఇప్పటి వరకు రూ. 8.54 లక్షల విరాళం అందించిన యాదిరెడ్డి

విజయవాడ ముత్యాలపాడులోని సాయిబాబా మందిరానికి ఓ యాచకుడు లక్ష రూపాయల విరాళం ఇచ్చాడు. ఆలయం వద్ద బిచ్చమెత్తుకుని జీవించే యాదిరెడ్డి మందిర అభివృద్ధికి తనవంతు సాయంలో భాగంగా ఈ విరాళం ఇచ్చారు. మందిరం గౌరవాధ్యక్షుడు గౌతమ్‌రెడ్డికి నిన్న ఆ సొమ్ము అందించాడు.ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ సంపాదించే సొమ్మును తిరిగి స్వామికే ఇవ్వడం ఆనందంగా ఉందని, ఇకపైనా ప్రతీ రూపాయి దైవ కార్యానికే అందిస్తానని ఈ సందర్భంగా యాదిరెడ్డి తెలిపారు. తన జీవితం బాబా సేవకే అంకితమన్న ఆయన ఆలయ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ. 8.54 లక్షల విరాళం ఇవ్వడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article