Monday, April 21, 2025

Creating liberating content

తాజా వార్తలుటిడిపి తీర్థం పుచ్చుకున్న వైస్ ఎంపీపీ

టిడిపి తీర్థం పుచ్చుకున్న వైస్ ఎంపీపీ

ఏలేశ్వరం:-

మండల వైస్ ఎంపీపీ చిక్కాల రాజ్యలక్ష్మి దేవి ఆమె భర్త లింగంపర్తి సొసైటీ అధ్యక్షుడు చిక్కాల లక్ష్మణరావు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు లింగంపర్తి గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వరుపుల సత్యప్రభ వీరికి తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ప్రత్తిపాడు శాసనసభ్యుడు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆశీస్సులతో దంపతులిద్దరు చెరోకా పదవిలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా పార్టీ మారడం అనివారమైనట్లు వారు అంటున్నారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ప్రత్తిపాడులో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఇప్పటికే నియోజకవర్గం లోనే కాక రాష్ట్రంలో వైకాపా పార్టీ 50 శాతం ఖాళీ అయిపోయిందన్నారు.వీరితో పాటు గ్రామానికి చెందిన 50 వైస్సార్సీపీ కుటుంబాలు టీడీపీ లో చేరారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి యనమల కృష్ణుడు , రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వత్సవాయి సూర్యనారాయణ రాజు (మీసాల రాజు)
జ్యోతుల పెదబాబు, సూతి బూరయ్య, ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి), నూకతాటి ఈశ్వరుడు, పెంటకోట శ్రీధర్, బసా ప్రసాద్, వనం మంగ, జిగటాపు సూరిబాబు, మూది నారాయణ స్వామి, బొదిరెడ్డి గోపి, బద్ది రామారావు, వెన్నా శివ, పైలా సాంబశివరావు, ఇతంశెట్టి భాష్కర బాబు, పసగడుగుల రమణ, కొమ్ముల కన్నబాబు, అమరాది వెంకట్రావు, యాళ్ల విశ్వేశ్వరరావు, ఓలుపల్లి శ్రీకాంత్, కర్రి సుబ్బారావు, బుచ్చిరాజు, పాస్టర్ జోకాబ్, పలివెల వెంకటేశ్వరరావు, గుణిపూడి కొండబాబు, బోరా సత్యనారాయణ మరియు
నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article