Sunday, April 20, 2025

Creating liberating content

తాజా వార్తలుపీర్ల చావిడి అభివృద్ధికి రూ.లక్ష విరాళం

పీర్ల చావిడి అభివృద్ధికి రూ.లక్ష విరాళం

ప్రజాభూమి బ్యూరో, అనంతపురం

కనగానపల్లి మండలం కుర్లపల్లి గ్రామంలో పీర్లచావిడి అభివృద్ధి నిమిత్తం లక్ష రూపాయలను విరాళంగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అందించారు. మంగళవారం అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుర్లపల్లి గ్రామానికి చెందిన పలువురు ముస్లిం మైనార్టీలు పీర్ల చావిడి అభివృద్ధిపై ఎమ్మెల్యేను కలిసి చర్చించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లక్ష రూపాయలు నగదును అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల మండల కన్వీనర్, ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article