Sunday, April 20, 2025

Creating liberating content

క్రీడలుపారిస్‌ ఒలింపిక్స్‌కు టేబుల్‌ టెన్నిస్‌ జట్లు

పారిస్‌ ఒలింపిక్స్‌కు టేబుల్‌ టెన్నిస్‌ జట్లు

న్యూఢిల్లీ: భారత టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ జట్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించాయి. ఒలింపిక్స్‌కు టీమ్‌ విభాగంలో పురుషుల, మహిళల జట్లు అర్హత సాధించడం ఇదే తొలిసారి. ప్రపంచ టిటి ర్యాంకింగ్స్‌ ఆధారంగా ఈ రెండు జట్లు ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాయి. పురుషుల, మహిళల జట్లు ప్రపంచ టిటి ర్యాకింగ్స్‌లో పురుషుల జట్టు 7వ ర్యాంక్‌లో నిలువగా.. మహిళల జట్టు 13వ స్థానంలో నిలిచింది. భారత్‌తోపాటు పోలండ్‌(12), స్వీడన్‌(15), థారులాండ్‌ కూడా పారిస్‌ ఒలింపిక్స్‌కు ర్యాంకింగ్స్‌ ఆధారంగా బెర్త్‌ దక్కించుకున్నాయి.గత నెలలో బూసాన్‌ వేదికగా జరిగిన ప్రపంచ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌కు భారత పురుషుల, మహిళల టీమ్‌ జట్లు ఫైనల్‌కు చేరడంతో ర్యాంకింగ్స్‌లోనూ ఎగబాకాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article