Sunday, January 19, 2025

Creating liberating content

తాజా వార్తలుహర్యానాలో టూరిస్టు బస్సులో మంటలు.. 9 మంది సజీవదహనం

హర్యానాలో టూరిస్టు బస్సులో మంటలు.. 9 మంది సజీవదహనం

హర్యానాలోని నూహ్ లో శనివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కేఎంపీ ఎక్స్ ప్రెస్ వేపై ఓ టూరిస్టు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 9 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో 13 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నల్హార్ మెడికల్ కాలేజీకి తరలించారు. యూపీలోని మథుర నుంచి పంజాబ్ లోని జలంధర్ కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మథురలోని బృందావనాన్ని గత వారం సందర్శించిన పంజాబ్, హర్యానాకు చెందిన భక్తులు తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article