Monday, January 20, 2025

Creating liberating content

తాజా వార్తలుతమిళనాడులో హత్యకు గురైన బీఎస్పీ అధ్యక్షుడి కుటుంబానికి కేంద్రమంత్రి పరామర్శ

తమిళనాడులో హత్యకు గురైన బీఎస్పీ అధ్యక్షుడి కుటుంబానికి కేంద్రమంత్రి పరామర్శ

తమిళనాడులో హత్యకు గురైన బీఎస్పీ నేత కె.ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబాన్ని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే బుధవారం పరామర్శించారు. ఆర్మ్‌స్ట్రాంగ్ ఇటీవల హత్యకు గురయ్యాడు. చెన్నై పెరంబూర్‌లో ఈ నెల 5న ఆయన హత్యకు గురయ్యాడు. ఆర్మ్‌స్ట్రాంగ్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి కేంద్రమంత్రి నివాళులు అర్పించారు.చెన్నైలో నిర్మాణంలో ఉన్న ఆయన ఇంటి బయట కొంతమంది వ్యక్తులు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. ఓ నిందితుడు ఆదివారం నాడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. అతను పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతనిని ఎన్‌కౌంటర్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article