Sunday, January 19, 2025

Creating liberating content

క్రీడలురాష్ట్ర స్థాయి క్రీడలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు

రాష్ట్ర స్థాయి క్రీడలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు

హిందూపురం టౌన్
హిందూపురం రూరల్ మండలం సి.చెర్లోపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. వాలీబాల్ కు జి.గణేశ్, జునాయిద్, అరుణ్, 200 మీటర్స్ పరుగు పందెంలో మనోజ్, సతీష్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. అనంతరం ప్రిన్సిపాల్ అశోక్ నాయక్ మాట్లాడుతూ, అతి చిన్న వయసులో రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక అవ్వడం సాధారణ విషయం కాదని, ఈ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article