Tuesday, January 14, 2025

Creating liberating content

తాజా వార్తలుసత్యదేవుని సన్నిధికి గొల్లప్రోలు నుండి పాదయాత్రభారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు

సత్యదేవుని సన్నిధికి గొల్లప్రోలు నుండి పాదయాత్రభారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు

గొల్లప్రోలు 

కార్తీకమాసం పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు గొల్లప్రోలు నుండి అన్నవరం సత్యదేవుని సన్నిధికి పాదయాత్రగా వెళ్లారు. స్థానిక కనకదుర్గ అమ్మవారి ఆలయం నుండి సుమారు 3వేల 500 మంది భక్తులు ఆదివారం మహా పాదయాత్రగా బయలుదేరి శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
ఈపాదయాత్రను పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అలాగే పాదయాత్రకు విచ్చేసిన భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవోతో మాట్లాడి మర్రెడ్డి భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని గడిచిన మూడు రోజులుగా జనసేన మామిడాల సూరిబాబు, బస్సా చిట్టిబాబు,బలిరెడ్డి గంగబాబు,అక్కిరెడ్డి శ్రీను తదితర నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే ఉదయమే పాదయాత్రకు విచ్చేసిన భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.సాయి ప్రియ సేవా సమితి వ్యవస్థాపకులు జ్యోతుల శ్రీనివాస్ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article