పురపాలక లో పరమాన్నం
అక్రమ నిర్మాణాలపై అడ్డు కట్టే లేదు..
అవినీతి అధికారులకు అగ్రతాంబులం
అందుకే అడ్డగోలు నిర్మాణాలు చేస్తున్నా అడిగేవారు లేరు
అడ్డంగా దోచుకుంటున్నా ఆపే వారు లేరు..
అండగా ఉండేది అక్కడి కార్పోరేటరే
అంతా లోపాభూయిష్టం..అంతిమంగా అన్యాయం..
కార్పొరేషన్ కు గండికొట్టేందుకు భాయి భాయి..
నాడు గంధం ప్రసాద్…నేడు అవినీతిలో రోజుకో మలుపు…
ఆ కార్పొరేటర్ గుప్పిట్లో సిటీ ప్లానర్ ఉన్నాడట ..
భవానిపురం మార్బుల్స్ నిర్మాణాల చిత్రాలు చూడతరమా..
తాయిలాలు ఇస్తే తప్పులు ప్రోత్సహిస్తారా..
భవానిపురం డివిజన్ నిర్మాణాలు భలే భలే..
ఉన్నది కూటమి.. కొల్లగొట్టేది వైసీపీ..
నిర్మాణాలన్ని తూచ్..
ధ్యానచంద్ర ధ్యాసకూడా మార్చారా..
ఈ అవినీతి కంపు కడిగేదెవరు..
కూటమి ఎమ్మెల్యే ఉన్న కుట్రలు అపలేరా..
ఆయనకు కూడా కట్టలు ముట్టచెప్పారని కబుర్లా..
కీ రోల్ తిప్పుతున్న కార్పొరేటర్ ..
సుజనా గారు సూక్ష్మంగా చూడరా…ఈ చెండాలాన్ని…
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
ధనమే అన్నిటికీ మూలం.అయితే ఆ ధనం సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.కష్టపడి శ్రమించి ధనం కూడబెట్టుకోవడం అనేది అన్నిటికంటే ఉత్తమైన మార్గం. ప్రస్తుతం ఈ ఆధునిక సమాజంలో అహైకిక శుఖాలకు అలవాటు పడిన వ్యక్తులు అనతి కాలంలో నే అత్యంత ధనికులు గా చెలామణి అవ్వడానికి అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు.ఇందులో ఈ అక్రమ మార్గానికి కూడా ఒక సర్టిఫికేట్ తో కూడిన హోదా తీసుకుంటున్నారు. అందుకే ఈ సమాజం ఇలా తయారవుతుందని భావించాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం తప్పులున్న చోట తప్పులు లేనట్లు తమ జేబులు నింపుకుంటున్నారు.ఇలాంటి దుస్థితి బెజవాడ కార్పోరేషన్ లో భవానిపురం సర్కిల్ పరిధిలో అధికంగా చోటు చేసుకుంది.గడిచిన ఎన్నికల్లో ఫ్యాన్ హవ్వా కొనసాగి కనీసం రాజకీయ పరిజ్ఞానాన్ని లేని కేవలం ఆర్దిక ప్రయోజనం కోసం అడ్డంగా సంపాదించుకోవడా నికి అలవాటు పడ్డ కొంతమంది ని కార్పొరేటర్ల్ గా ఎన్నుకోవడం జరిగింది. వీరికి అండగా నాటి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అండదండలు పుష్కలంగా ఉండేవి.ఇంకేముంది నిర్మాణం చేపట్టాలంటే నిధులు సమకూర్చుకునే పరిస్థితి దాపు రించింది భవానిపురం ఏరియా వార్డుల్లో. ఇక్కడ నిధులు నిర్మాణానికి సంబంధించి ఇసుక ఇటుక సిమెంట్ నిర్మాణ దారులు కు కాదండోయ్.నిర్మాణం చేపట్టాలంటే నిబంధనలు సడలింపు ,ప్రభుత్వ అనుమతి తీసుకునేది ఒకటి కట్టెది ఒకటి ఇలా తప్పులు చేసిబా బైటికి కన పడకుండా ఉండటం కోసం.నిర్మాణం బట్టి కనీసం రెండు లక్షల రూపాయలు అక్షరాల ఏరియా కార్పోరేటర్ కు ఇచ్చుకోవాలి.ఇక్కడ ఇంకో బంఫర్ ఆఫర్ ఉంది.ఒక కార్పొరేటర్ అయితే కార్పోరేషన్ అనుమతులు కూడా ఇప్పిస్తాడు.. అనుమతుల్లో తేడా ఉన్నా ఆ విషయం బైటికి రాకుండా అటు అధికారులకు ఇటు ఇతరులకు ఆమ్యామ్యా లు ఇచ్చేస్తారు.ఈ సంస్కృతి అనాదిగా ఉన్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరింత దారుణ పరిస్థితి కి చేరుకుందని చెప్పాలిఈ పరిస్థితి చివరికి ఎలా దాపురించదంటే టిపిఓ గంధం ప్రసాద్ అనే అధికారికి జీతం లేదు.విశాఖ, విజయవాడ కార్పోరేషన్లలో ఆయన వెలగ బెట్టిన ఉద్యోగానికి విజిలెన్స్ విచారణ చేసి ఈ అధికారి చాలా మంచిగా అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించాడని నోటీసులు ఇస్తే అందుకు వివరణ ఇచ్చిన తాయిలాలు ఇచ్చిన సంతృప్తి చెందని అధికారులు జీతం ఆపేశారు.వైసీపీ ప్రభుత్వం లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదాసీనత మంచితనం ఎరగా చేసుకుని స్థానిక కార్పొరేటర్ లు మద్దతుతో విశాఖ నుండి బెజవాడ కు బదిలీ అయ్యాడు. ఈ బదిలీతో పాటు ఏ అధికారికి కూడా ఎల్పీసీ ఇస్తారు.ఆయితే ఈ గడుసరి గందం ప్రసాద్ కు ఆ లెటర్ ఇవ్వలేదు.అయిన వడ్డించే వాడు మన వాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్న అన్నీ వస్తాయి అన్న చందానా బెజవాడ లో రావడం వస్తూనే రెడ్ కార్పెట్ వేశారు ఇక్కడి కొంతమంది అవినీతి అధికారులు, నీతి లేని కార్పోరేటర్ లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్పీసీ లేకుంటే జీతం ఇవ్వరు.జీతం లేని అధికారికి ఉద్యోగ బాధ్యతలలో లుప్లైన్ లాంటివి అప్పగిస్తారు. ఇక్కడ అలా జరగలేదే ఈ బెజవాడ కార్పొరేసన్ లో ఏ టీపీఓ కు ఇవ్వని వార్డులు ఈ గడుసరి గంధం కే అధిక వార్డులు కేటాయించడం జరిగింది. ఇంకేముంది అనుకున్నట్లు ఇక్కడి కాసుల కోసం కట్టడాలు కు అనేక అడ్డంకులు సృష్టిస్తోన్న కార్పొరేటర్ లకు వరమై నిలిచాడు. ఇంకేముంది నీకిది నాకిది అంటూ ఏ కట్టడం కట్టాలన్నా కాసులిచ్చుకో కట్టడాలు కట్టుకో అన్న కొత్త సూక్తిని అజెండా గా పెట్టుకుని భారీగా దోచుకున్నారు. ఇలాంటి అవినీతి అధికారులు, నీతి లేని నేతల వల్ల బుడమేరు బెజవాడ ను ముంచెత్తి అన్నామో రామచంద్ర అంటూ అలమటించె స్థితికి కారణమయ్యారు.కొంతమంది నీతిలేని వారి వల్ల వరద నీటిలో కొట్టు మిట్టాడి పోయారు.ఈ రోజు దాదాపు మూడువేలకు పైగా ఆక్రమిత మిర్మాణాలు వందల ఎకరాల లో ప్రక్షాళన చేయాల్సి వస్తుంది.హైదరాబాద్ లో హైడ్రాపేరుతో కూల్చివేతలు చేస్తున్నారు. ఇక్కడ హైడ్రామా మధ్య అక్రమ నిర్మాణాలు నిర్మాణం చేస్తున్నారు. ఒక నిర్మాణదారుడు ఒక కార్పొరేటర్ కాసుల కక్కర్తి భరించలేక ఆత్మహత్య చేసుకోబోయిన సంఘటన కూడా గతం లో జరిగినట్లు అప్పట్లో వార్తలు బైటికి రాగ మహా తెలివైన కార్పొరేటర్ కాసులిచ్చి కామ్ చెసినట్లు తెలిసింది. అసలు రిటైర్మెంట్ అయిన టిపిఓ సచివాలయం సెక్రటరికి కూడా తెలియకుండా కొన్ని అనుమతులు ఇచ్చినట్లు దాని ఫలితంగా ఇప్పుడు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.భవాని పురం ఐరన్ యార్డ్ 43 వ డివిజన్లో చోటు చేసుకున్న అక్రమ నిర్మాణాలు చూస్తే గత టిపిఓ గందం ప్రసాద్ అవినీతి అట్టే బహిర్గతం అవుతుంది. ఇవన్నీ సిటీ ప్లానర్ కు ఆ ఏరియా కార్పొరేటర్ లకు తెలియకుండా జరిగాయా అంటే సమాధానం అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. అయితే ఈ అవినీతి గంధం ప్రసాద్ మున్సిపల్ శాఖ లో ఉన్న ఓ ఉన్నతాధికారికి అన్ని రకాలుగా చెల్లించుకోవడం తోనే ఆ అండ దండ ఇక్కడ కార్పొరేటల దండుగా నిలబడటం తో దండిగా సంపాయించుకుని గొప్పగా సన్మానించుకుని వెళ్లడం జరిగింది.కొత్తగా వచ్చిన అధికారి కొత్త నిర్మాణాలను పాత ఖాతాలో వేసి కొత్త సీసాలో పాత సారా అన్నట్లు చల్లగా జారుకుంటూ అక్కడి కార్పొరేటర్ కబంధ హస్తాల్లో ఉండిపోయాడన్న వినికిడి వస్తుంది.అయితే ఇక్కడ కోట్లకు పడగలెత్తి ప్రభుత్వం లో ఉన్న వేసులుబాటు తో దర్జాగా దర్గాభూముల్లో దండిగా నిర్మాణాలు చేపడుతూనే ఉన్నా కట్టడి చేయాల్సిన అధికారులు చేష్టలుడిగి ఉన్నారని చెప్పాలి.అయితే ఓ ప్రముఖ దినపత్రికలో కథనం రాగానే కంటితుడువు చర్యగా కొన్ని రేకులు తొలగించి కొన్ని ఇటుకలు తొలగించి అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపామని మూటల కోసం వాటాలపై వాడి వేడి గా చర్చ జరుపుతున్నట్లు తెలుస్తుంది.మరో నయీయ్ గ్యాంగ్ లా టైల్స్ బాయ్ అయ్యాడా…?దర్గా. భూముల్లోదర్జాగా నిర్మాణాలు చేపట్టడం చేపట్టిన నిర్మాణానికి సంబంధించి అన్ని రకాల విషయాలు చూడుకోడానికి ఇక్కడ టైల్స్ బాయ్ గ్యాంగ్ ఉందని వినికిడి. ఈ టైల్స్ బాయ్ గ్యాంగ్ కు అడ్డాగా ఆ కిరికిరి కార్పొరేటర్ పేరులోనే కోట్లు ఉన్న ఆయన ఉంటూ ఆ డివిజన్ లో జరిగే అక్రమ నిర్మాణాలకు ఆయనే అందరికి ఆమ్యామ్య ఇస్తూ అన్ని చూసుకోవడం ఒకటి.ఈ టైల్స్ బాయ్ కి ఈ కిరికిరి కార్పొరేటర్ కు అక్కడి నిర్మాణ దారులు దర్గా భూములు అయితే టైల్స్ బాయ్ తో కలిసి, ఇతర నిర్మాణాలు అయితే ఈ కార్పొరేటర్ కబంధ హస్తాల్లో కట్టాల్సిందే నని అక్కడ తీర్మానం ఉన్నట్లు అక్కడి వారు వాపోతున్నారు.కూటమి ఎమ్మెల్యే ఉన్నా ఆగని కుట్రలు…ఎదయితే భవాని పురం పురపాలక సర్కిల్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ నిర్మాణ వ్యవహారం అన్ని పశ్చిమ నియోజకవర్గ పరిధిలోనే.అయితే ప్రస్తుతం సీనియర్ నాయకులు విజ్ఞులైన కూటమి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఉన్నా ఆయనకు కూడా వాటాలు ఇచ్చామని వాగుతూ వైసీపీ కార్పొరేటర్ అయినా కూటమిలో పట్టు ఉందంటూ అక్రమ కట్టడాలకు ఇంకా ఆజ్యం పోస్తూ అప్పనంగా దోచుకుంటున్నట్లు అనేక ఊహాగానాలు వస్తున్న శాసనసభ్యులు సూక్ష్మంగా ఎందుకు పరిశీలన చేయలేక పోతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు అక్కడి కూటమి నేతలు.కమిషనర్ ధ్యాసనే మార్చారా..పురపాలక ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు యువ ఐఎఎస్ ద్యానచంద్రని బెజవాడ పురపాలక కమిషనర్ గా నియమించారు. అయితే ఆయన అనేక విషయాల పై ద్యాస పెడుతున్నా ఈ అక్రమ నిర్మాణాలపై ఆయన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.అసలు వీటన్నింటికి మూల కారణమైన ప్లానింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా పక్కా ప్రణాళికలతో పక్క దోవ పట్టించే పనిలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో పురపాలక శాఖలో అవినీతి తిమింగళాలు హాయిగా అక్రమ సంపాదన లో అరితేరి పొతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాల పై పురపాలక శాఖ కమిషనర్ పూర్తిస్తాయి పర్యవేక్షణ చేస్తారా లేదా అన్నది చూడాలి.