Monday, January 20, 2025

Creating liberating content

తాజా వార్తలుఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాలి

ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాలి

వేంపల్లె
విద్యార్థుల్లో నైతిక విలువలతో పాటు ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించాలని వైయస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సి. యోగాంజనేయులు అన్నారు. స్థానిక శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో భగవద్గీత పారాయణం భక్తి భావంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమిష్టిగా గీత శ్లోకాలను పారాయణం చేసి ఆధ్యాత్మిక శ్రద్ధను చాటి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో అవసరం అని ఆయన తెలియజేశారు. అనంతరం భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బి.చక్రపాణి రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్లు చేతన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article