కడప సిటీ:
సన్నహాక సమావేశంలో ఆదివారం ఫిబ్రవరి 4 నాడు వామపక్ష కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ,
బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కార్మికులు, కర్షకుల హక్కులను కాలరాస్తున్న, కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని ఈనెల 16వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కడప జిల్లా వ్యాప్తంగా జయప్రదం చేయాలని వామపక్ష కార్మిక ,రైతు వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శులు నాగ సుబ్బారెడ్డి, మనోహర్, దస్తగిరి రెడ్డి, సుబ్బారెడ్డి, అన్వేష్, భాస్కర్ , శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఆదివారం కడప నగరంలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. 2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచకుండా కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని వారు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఒకవైపున పెట్రోల్ డీజిల్, గ్యాస్, ధరలను విపరీతంగా పెంచేసి, ప్రజల నెత్తిన భారాలు వేయడమే కాక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అందులో భాగంగానే దేశ సంపదను అంబానీ, అదాని వంటి కార్పోరేట్ శక్తులకు కారు చౌకగా దోచిపెడుతుందని ఆయన విమర్శించారు. నరేంద్ర మోడీ పరిపాలనలో కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు కల్పించిన నరేంద్ర మోడీ రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికుల హక్కులను కాల రాశారని ఆయన మండిపడ్డారు. అదా నీ అంబానీలను కుబేరులను చేసి, రైతులను వ్యవసాయ కార్మికులను అప్పులు పాలు చేశారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే మూడు నల్ల చట్టాలు తీసుకువచ్చారని అన్నారు. అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చారన్నారు. అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. నిరంకుశ పరిపాలన సాగిస్తున్న కేంద్ర బిజెపి, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని గద్దించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఏకం అవ్వాలని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు సీ టు 50 శాతం ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని, కేరళ రాష్ట్ర విధానాన్ని అమలు చేయాలని అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేసేందుకు రుణ ఉపశమన చట్టాన్ని చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. ఉపాధి కూలీలకు 200 పని దినాలు పెంచి, వేతనం 600 రూపాయలు ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ఆన్లైన్ మస్టర్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు తుఫాన్ నష్టపరిహారాలను ఇన్పుట్ సబ్సిడీలను రైతులకు వెంటనే ఇవ్వాలని, రైతులందరికీ పంటల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సాగులో ఉన్న కౌలు రైతులకే, నష్టపరిహారాలు బీమా సౌకర్యం ఇవ్వాలన్నారు. అంతేకాకుండా విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించి, స్మార్ట్ మీటర్ల బిగించే విధానాన్ని నిలుపుదల చేయాలన్నారు. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె గ్రామీణ ప్రాంత బంద్ జయప్రదం కోసం జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు బాదుల్లా, మల్లికార్జున, మద్దిలేటి సుబ్బారాయుడు, రైతు సంఘం నాయకులు యానాదయ్య , బాలచంద్రరయ్య,శంఖర్ రెడ్డి , బద్రయ్య, కొండయ్య, గురవయ్య, పక్కిరప్ప , తోపాటు మరికొంతమంది పాల్గొన్నారు.