Monday, April 21, 2025

Creating liberating content

తాజా వార్తలుజగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగమైంది

జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగమైంది

వైసీపీ ఎర్ర చందనం మాఫియా దారుణాలకు పరాకాష్ఠ అంటూ లోకేశ్ ఫైర్

అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై మెరుపుదాడులకు పాల్పడి, కానిస్టేబుల్ గణేశ్ ని చంపేయ‌టం రాష్ట్రంలో వైసీపీ ఎర్ర చందనం మాఫియా దారుణాల‌కు ప‌రాకాష్ఠ అని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. “జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగమైంది. పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి, అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ప్లానింగ్ తో వైసీపీ ఎర్ర చందనం మాఫియా అవతారం ఎత్తింది. ఎర్రచందనం స్మగ్లర్లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన జగన్ ఎర్ర చందనం స్మగ్లింగ్ కి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశాడు. అడ్డొచ్చిన పోలీసుల్ని వైసీపీ ఎర్ర చందనం మాఫియా చంపేస్తోంది. టాస్క్ ఫోర్స్ పోలీసు వాహ‌నాల‌నే ఢీకొట్టి కానిస్టేబుల్‌ని చంపేశారంటే… స‌ర్కారీ పెద్ద‌ల అండ‌దండ‌ల‌తో ఎంత‌గా బ‌రితెగించారో అర్థం చేసుకోవ‌చ్చు. విధినిర్వ‌హ‌ణ‌లో పాల‌కుల మాఫియాకి బ‌లైన కానిస్టేబుల్ గ‌ణేశ్ కి నివాళులు. వారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను. గ‌ణేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. గణేశ్ ని అత్యంత కిరాతకంగా చంపేసిన ఎర్ర చందనం మాఫియాను కఠినంగా శిక్షించాలి” అంటూ నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article