Sunday, April 20, 2025

Creating liberating content

తాజా వార్తలుఅరటి పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

అరటి పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

రెండు నెలల లోపు పనులు పూర్తి చేయాలి

ప్రజాభూమి,పులివెందుల

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణ పల్లి గ్రామ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న అరటి పరిశోధన కేంద్రాన్ని మంగళవారం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గోటూరు చిన్నప్ప, సీఈ శ్రీనివాస్, ఏడి వెంకటేశ్వర్లు, డిహెచ్ఓ మైఖేల్ రాజీవ్, ఏ డి హెచ్ సుభాషిని, డి ఈ పాహిం, ఈ ఈ వెంకటేశ్వరరావు, విజిలెన్స్ జెడి రాజశేఖర్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ 13 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ ఏసి గోదాములలో రైతులు అరటి నిలువ చేసుకునేందు కు వీలుగా, అనుగుణంగా నిర్మించడం జరుగుతుం దన్నారు. ఈ పనులన్నిటినీ రెండు మాసాల నాటికి పూర్తిచేయాలని గుత్తేదారులకు సూచించారు. అరటి జూసు అరటి చిప్స్ తయారు చేసే కేంద్ర 70 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న పనులను వారు పరిశీలించారు. ఈ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు. పనుల్లో నాణ్యత కోల్పోకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపి, పిడి రవీంద్రనాథ్ రెడ్డి, హెచ్ ఓ రాఘవేంద్ర రెడ్డి, మార్కెటింగ్ ఎడి ఆజాద్ వలి, మార్కెటింగ్ ఏఈ మేఘనాథ్ , వైయస్సార్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ డైరెక్ట్ శివ ప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article