Monday, January 20, 2025

Creating liberating content

తాజా వార్తలుబీసీ గర్జనకు బయలుదేరిన టిడిపి తమ్ముళ్లు

బీసీ గర్జనకు బయలుదేరిన టిడిపి తమ్ముళ్లు

జీలుగుమిల్లి:బీసీ గర్జనకు తరలి వెళ్తున్న తెలుగు తమ్ముళ్లను మండల టిడిపి అధ్యక్షులు సుంకవెల్లి సాయి జండా ఊపి ప్రారంభించారు. జీలుగుమిల్లి మండలంలోని మొలగంపల్లి, అంకంపాలెం, కామయ్యపాలెం నుండి తెలుగు తమ్ముళ్లు బయలుదేరి మంగళగిరి వెళ్లారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో జరిగే బీసీ గర్జనకు తెలుగు తమ్ముళ్లు మరింత రెట్టింపు ఉత్సాహంతో బయలుదేరారు .ఏది ఏమైనా రానున్న రోజులలో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుందని బీసీ నాయకులకు పార్టీ అధ్యక్షులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాలి శ్రీను మరిదు పండు బీసీ సంఘం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article