Sunday, January 12, 2025

Creating liberating content

తాజా వార్తలుస్టెల్లా షిప్ లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారుల బృందం

స్టెల్లా షిప్ లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారుల బృందం

పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం తరలిస్తున్న స్టెల్లా షిప్ ను కాకినాడ పోర్టులో అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ షిప్ లో రెవెన్యూ, పోలీసు, కస్టమ్స్, పోర్టు, పౌరసరఫరాల శాఖ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై ఏపీ ప్రభుత్వం ఈ మల్టీ డిసిప్లినరీ కమిటీని వేసింది. బియ్యం నమూనాలను సేకరించి నిజానిజాలను ఈ టీమ్ నిగ్గుతేల్చనుంది. ఈ షిప్ లో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్టు కాకినాడ జిల్లా కలెక్టర్ గత నెల 27న ప్రకటించారు. 29వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. బియ్యం స్మగ్లింగ్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీజ్ ద షిప్’ అంటూ ఆయన అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే షిప్ లో అధికారుల బృందం ఈరోజు మరోసారి తనిఖీలను చేపట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article