Friday, January 17, 2025

Creating liberating content

క్రీడలుఢిల్లీలో భార‌త హాకీ జ‌ట్టుకు ఘ‌న స్వాగ‌తం..

ఢిల్లీలో భార‌త హాకీ జ‌ట్టుకు ఘ‌న స్వాగ‌తం..

భారత పురుషుల హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన తర్వాత శనివారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జట్టుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, గోల్ కీపర్ శ్రీజేశ్, మాజీ సారథి మన్ప్రీత్ సింగ్, ఇతర ఆటగాళ్లకు పూలదండలు, రుమాలు వేసి అధికారులు స్వాగతం చెప్పారు. ఈ సమయంలో జట్టులోని ప్రతి సభ్యుడు ఆనందంగా, ఉల్లాసంగా కనిపించారు. కొందరు ఆటగాళ్లు బ్యాండ్ చప్పుళ్లకు హుషారుగా తీన్మార్ స్టెప్పులు వేశారు.భారత జట్టు గురువారం స్పెయిన్‌తో జరిగిన కాంస్య పతక పోరులో 2-1 తేడాతో విజయం సాధించింది. 1968 మెక్సికో సిటీ, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో వరుసగా రెండు కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టు, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కూడా కాంస్యంతో మెరిసింది. ఇదే జట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడం విశేషం.ఈ విజయంతో భారత హాకీ జట్టు భారతదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ప్రశంసలు పొందుతోంది. జట్టు కృషి, పట్టుదల, నిరంతర శ్రమ ఫలితంగా ఈ ఘనత సాధించగలిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article