భీమవరం
పృథ్వీ శ్రీచక్ర పంచాయతన పూజ.
హైదరాబాద్ , గుడిమల్కాపూర్ , ఎస్ బి ఐ కాలనీలో ఉన్న “నవ గోపికా సంఘం” కు చెందిన కె. సుజాత, యు.నాగమణి తదితరులు ఆధ్వర్యములో డిసెంబర్ 8 వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుండి ప్రశస్థమైన దేవాలయం అయినటువంటి భీమవరం శ్రీ మావుళ్ళమ్మ ఆలయములో “పృథ్వీ శ్రీ చక్రము” వేసి, శ్రీ చక్రార్చన పూజ చేయాలని సంకల్పించడం జరిగిందని
ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ శనివారం తెలిపారు. శ్రీ దేవి ఖడ్గమాల, ఆ తదుపరి శ్రీ లలిత సహస్ర నామ పారాయణం జరుగుతుంది అని దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ తెలిపారు.కావున భక్తులందరు కూడా దీనిని ఒక దీక్షగా భావించి ఈ కార్యక్రమం లో పాల్గొని ఆలయం లో కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని కోరుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని .దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ కోరారు..