Sunday, January 19, 2025

Creating liberating content

తాజా వార్తలువృద్ధుడిని వెయిట్ చేయించిన ఉద్యోగులు.. నిల్చునే ఉండాలని సీఈఓ పనిష్​మెంట్

వృద్ధుడిని వెయిట్ చేయించిన ఉద్యోగులు.. నిల్చునే ఉండాలని సీఈఓ పనిష్​మెంట్

తనను కలిసేందుకు వచ్చిన ఓ వృద్ధుడిని కార్యాలయంలో నిల్చోబెట్టిన ఉద్యోగులందరికీ సీఈవో తగిన శిక్ష విధించారు. వృద్ధుడుని 20 నిమిషాలు నిలబెట్టినందుకుగాను కార్యాలయంలో పని చేసే ఉద్యోగులందరూ నిల్చోవాలంటూ సీఈవో ఆదేశించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో జరిగింది.ఈ ప్రాంతంలో ఉండే న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్ అథారిటీకి చెందిన కార్యాలయంలో తమ వద్దకు వచ్చిన వృద్ధుడికి ​సహకరించకుండా 20 నిమిషాలు వేచి ఉండమని 16 మంది ఉద్యోగులు చెప్పారు. దీంతో ఆ 16 మంది ఉద్యోగులను సీఈవో డాక్టర్ లోకేష్.. సిబ్బందికి విచిత్రమైన శిక్ష విధించారు. ఉద్యోగులందరినీ 20 నిమిషాల పాటు నిలబడి పని చేయాలని ఆదేశం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article