Sunday, January 19, 2025

Creating liberating content

తాజా వార్తలుచిన్ననాటి స్నేహితులు 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఘటన

చిన్ననాటి స్నేహితులు 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఘటన

సోషల్ మీడియాలో వైరల్

న్యూఢిల్లీ: చిన్ననాటి స్నేహితులు విడిపోయారు. ఏళ్ల తర్వాత కలిశారు. భారత్,పాకిస్తాన్ విభజనతో ఈ ఇద్దరు స్నేహితులు విడిపోయారు. అయితే చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సురేష్ కొఠారి, ఏజీ షకీర్ మంచి స్నేహితులు. 2023 అక్టోబర్ మాసంలో వీరిద్దరూ కలిశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గుజరాత్ రాష్ట్రంలోని దీసాలో సురేష్, ఏజీ షకీర్ లు పెరిగారు.వీరిద్దరికి 12 ఏళ్ల వయస్సున్న సమయంలో భారత్, పాకిస్తాన్ విభజన జరిగింది. ఏజీ షకీర్ కుటుంబం పాకిస్తాన్ కు వెళ్లింది. పాకిస్తాన్ లోని రావల్పిండిలో షకీర్ కుటుంబం స్థిరపడింది. తమ కుటుంబ చిరునామాను కూడ షకీర్ సురేష్ కు పంపారు.
వీరిద్దరూ ఏళ్ల తరబడి కలుసుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కలుసుకొనేందుకు వీలు కాలేదు. 1947 నుండి 1981 వరకు వీరిద్దరు కలుసుకోలేదు. అయితే 1982లో న్యూయార్క్ లో కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ కలుసుకున్నారు.2023 అక్టోబర్ లో మరోసారి వీళ్లిద్దరూ కలిశారు. 41 ఏళ్ల తర్వాత మరోసారి వీరిద్దరూ కలిశారు. 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న వీరిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కారణంగా వీరిద్దరూ వేర్వేరు దేశాల్లో నివసిస్తున్నప్పటికీ తమ మధ్య ప్రేమ తగ్గలేదని నిరూపించారు.సురేష్ 90వ పుట్టిన రోజున మరోసారి వీరిద్దరూ కలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.సురేష్ మనమరాలు వీరిద్దరిని కలిపేందుకు ప్రయత్నించింది.ఇందుకు సంబంధించిన వీడియోలను కూడ ఆమె పోస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article