Monday, January 20, 2025

Creating liberating content

క్రీడలుచెన్నై టెస్ట్.. తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగుల స్వల్ప స్కోరుకే బంగ్లాదేశ్ ఆలౌట్

చెన్నై టెస్ట్.. తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగుల స్వల్ప స్కోరుకే బంగ్లాదేశ్ ఆలౌట్

చెన్నై వేదికగా భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 149 పరుగుల స్వల్ప స్కోరుకే బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో చెలరేగాడు. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. పటిష్టంగా ఉన్న భారత బౌలింగ్ ధాటికి బంగ్లా బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. 32 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 27 పరుగులతో మెహదీ హసన్ మిరాజ్ నాటౌట్‌గా నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article