Monday, January 20, 2025

Creating liberating content

తాజా వార్తలుమోపూరి భైరవేశ్వరుని సన్నిధిలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి కుటుంబ సభ్యులు

మోపూరి భైరవేశ్వరుని సన్నిధిలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి కుటుంబ సభ్యులు

బండలాగుడుపోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ

పులివెందుల(వేముల)
కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకొని, పులివెందుల నియోజకవర్గం వేముల మండలం, కొండ్రెడ్డి పల్లె గ్రామంలో వెలసిన శ్రీ మోపూరి భైరవే శ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి స్వామివారినిదర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు కుటుంబ సభ్యులతో పూజారి చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడు తూ శ్రీ మోపురి బైరవేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి, రైతుల సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.అంతకు ముందుగా ఆలయ కమిటీ చైర్మన్ ఓబుల్ రెడ్డి, వెంకటరమణారెడ్డి లు ఆయనకు ఘన స్వాగతం పలికి దుష్యాలతో పూలహారాలతో సత్కరించారు. అనంతరం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని వారికి తెలియజేశారు. అనంతరం ఆయన బండలాగుడు పోటీలను ప్రారం భించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article