ప్యారిస్ ఒలింపిక్స్ 10వ రోజుకు చేరుకుంది. ఈ రోజు భారత క్రీడాకారులు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, మెన్స్ 3000 స్టిపుల్ ఛేజ్, రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు.
టేబుల్ టెన్నిస్: మహిళల టీమ్ ప్రిక్వార్టర్స్ (భారత్ × రొమేనియా)- మధ్యాహ్నం 1.30
అథ్లెటిక్స్: మహిళల 400మీ పరుగు తొలి రౌండ్ (కిరణ్ పహాల్)- మధ్యాహ్నం 3.25, పురుషుల 3000మీ స్టీపుల్ఛేజ్ తొలి రౌండ్ (అవినాశ్ సాబ్లె)- రాత్రి 10.34
సెయిలింగ్: డింగీ రేసు మహిళలు (నేత్ర)- మధ్యాహ్నం 3.45, పురుషులు (విష్ణు)- సాయంత్రం 6.10
రెజ్లింగ్: మహిళల 68 కేజీల ప్రిక్వార్టర్స్ (నిశా × సోవా)- సాయంత్రం 6.30
షూటింగ్: స్కీట్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫికేషన్ (మహేశ్వరి-అనంత్)- మధ్యాహ్నం 12.30
పతక రౌండ్లు: బ్యాడ్మింటన్: సింగిల్స్ కాంస్య పోరు (లక్ష్యసేన్ × జియా లీ)- సాయంత్రం 6