Tuesday, January 14, 2025

Creating liberating content

తాజా వార్తలుపులివర్తినానినిపరామర్శించిన ప్రముఖులు..!

పులివర్తినానినిపరామర్శించిన ప్రముఖులు..!

చంద్రగిరి:
తిరుపతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ పరిశీలించడానికి మే14వ తేదీ వెళ్లిన చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై వైసీపీ మూకలు హత్యయత్నానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో గాయపడిన పులివర్తి నాని ని పరామర్శించేందుకు సోమవారం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ తుడా చైర్మన్, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహయాదవ్, బంగారుపాలెం మండల పార్టీ అధ్యక్షులు జయ ప్రకాష్ నాయుడు, తిరుపతి టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీ, పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజా రెడ్డిలు ఆయన స్వగృహంకు చేరుకున్నారు. ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు తెగబడుతుందని వారు ఆరోపించారు. భారీ మెజార్టీ తో పులివర్తి నాని గెలవబోతున్నారని కుండబద్దలు కొట్టారు. 30 ఏళ్ల చరిత్ర ను చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ తిరగరాయబోతుందని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article