Monday, January 20, 2025

Creating liberating content

తాజా వార్తలువీరభద్రాలయంలో మాఘ మాస పూజలు ప్రారంభం

వీరభద్రాలయంలో మాఘ మాస పూజలు ప్రారంభం

ఆలయానికి పోటెత్తిన భక్తులు

లేపాక్షి : శిల్ప చిత్ర కళలకు నిలయమైన లేపాక్షి వీరభద్రాలయంలో మాఘ మాస పూజలు సోమవారం ప్రారంభమైనట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి నరసింహమూర్తి తెలిపారు. మాఘ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో దుర్గాదేవి ,వీరభద్రస్వామిలకు ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహ శర్మ, శ్రీనివాస కుమారులు ఉదయం అభిషేకార్చనలు నిర్వహించారు.

అనంతరం రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివార్లను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం దుర్గాదేవికి కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article