Monday, January 20, 2025

Creating liberating content

క్రీడలుఐపీఎల్ హిస్టరీలో 8,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా విరాట్

ఐపీఎల్ హిస్టరీలో 8,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా విరాట్

ఐపీఎల్ చరిత్రలో కింగ్ విరాట్ కోహ్లీ మరో రికార్డును సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 8,000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ నయా రికార్డు నెలకొల్పాడు. బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ప్రత్యేక మైలురాయిని సొంతం చేసుకున్నాడు.గత రాత్రి రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 33 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే వ్యక్తిగత స్కోరు 29 పరుగుల వద్ద విరాట్ 8,000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో శిఖర్ ధావన్ 6,769 పరుగులతో ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article