Sunday, April 20, 2025

Creating liberating content

తాజా వార్తలుపులివెందులకు చేరుకున్న అంబేద్కర్ విగ్రహం

పులివెందులకు చేరుకున్న అంబేద్కర్ విగ్రహం

పులివెందుల టౌన్
పులివెందుల మోడల్ టౌన్ లో భాగంగా అత్యంత సుందరీకరణ గా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేయుటకు ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అందులో భాగంగాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకున్న అంబేడ్కర్ విగ్రహాన్ని స్థానిక గరండల్ బ్రిడ్జి దగ్గర ఆవిష్కరించుటకు ఏర్పాట్లుచేస్తున్నారు.అందులో భాగంగా వైఎస్ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు మునిసిపల్ ఇంఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి , మున్సిపల్ ఛైర్మెన్ వరప్రసాద్, స్థానిక ఎస్సీ బిసి నాయకుల బృందం తో కలిసి స్థల పరిశీలన చేయడం జరిగింది.అందులో భాగంగా శిల్ప కళాకారుడి తో ప్రత్యేకంగా కళాత్మకంగా రూపొందించిన అంబేడ్కర్ విగ్రహం కూడా పులివెందులకు చేరుకోవడం జరిగింది. విగ్రహాన్ని గరండాల్ బుజ్జి వద్ద పెట్టడం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article