Sunday, April 20, 2025

Creating liberating content

సినిమావరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్ చేసుకున్న మేజర్

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్ చేసుకున్న మేజర్

వీరజవాన్ మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘మేజర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం.దర్శకుడు సాయి కిరణ్ తిక్కా తెరకెక్కించిన ఈ బయోపిక్ మూవీలో యంగ్ హీరో అడివి శేష్ మేజర్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయగా, అక్కడ కూడా ఈ మూవీకి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.ఈ సినిమాలో అడివి శేష్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని మన కళ్లకు కట్టినట్లుగా చూపెట్టాడు. బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా, శోభిత ధూళిపాల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా జూన్ 2022లో ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోగా, ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది.
ప్రముఖ ఛానల్ జెమిని టీవీలో మేజర్ చిత్రాన్ని మే 14న సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article